శాండిల్, ఓట్ మీల్ ప్యాక్ ట్రై చేయండి. ఒక టేబుల్ స్పూన్ గంధం పొడి, పావు కప్పు రోజ్ వాటర్, అర టీ స్పూన్ పసుపు తీసుకుని ఈ మూడింటిని కలిపి ముఖానకి అప్లై చేసి 30 నిమిషాలాగి చల్లటినీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే చర్మంపై నలుపు తొలగి చర్మం తాజాగా వుంటుంది.
అలాగే ఓట్ మీల్ ప్యాక్.. 3 టేబుల్ స్పూన్ల ఓట్మీల్, 1 ఎగ్ వైట్, 1 టీస్పూన్ తేనె, 1 టీ స్పూన్ పెరుగును బాగా కలిపి కొద్దిసేపు ఫ్రిజ్లో పెట్టాలి. తర్వాత ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరాక కడిగేసుకోవాలని బ్యూటీషన్లు అంటున్నారు.