బి.పి ఉంటే జీవితాంతం మందులు వాడాలా?

బీపీ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా హై బీపీ వచ్చి, నియంత్రణలోకి వచ్చిన తర్వాత 90 నుంచి 95 శాతం వరకు జీవితాంతం మందులు తీసుకోవడం అవసరం. ట్యాబ్లెట్లు తీసుకోవడం ఆపితే ఈ సమస్య మళ్లీ ఎక్కువ కావచ్చు. కాని డాక్టర్ సలహా మేరకు రెగ్యులర్‌గా మందులు వాడితే కొందరిలో వీటి మోతాదు తగ్గించడానికి వీలు అవుతుంది. మందులు మధ్యలో మానివేయటం వల్ల బీపీ అధికమై పక్షవాతం లాంటి ప్రమాదాలు సంభవించడానికి ఆస్కారం ఉంది. కనుక డాక్టర్ సలహాలు పాటిస్తూ మందులను క్రమం తప్పకుండా వాడటం మంచిది. ఒకవేళ రెండు మూడు రకాల మందులు వాడినా బీపీ నియంత్రణలోకి రాని పక్షంలో ఈ మధ్య కొత్తగా రీనల్ డినర్వేషన్ థెరపీ అనే ప్రత్యేక చికిత్స ద్వారా ఎంతటి హై బీపీని అయినా నియంత్రించి రోగికి భవిష్యత్తులో వచ్చే హార్ట్‌ఎటాక్, పక్షవాతం, కిడ్నీల పనితీరు దెబ్బతినడం వంటి వాటిని నివారించే అవకాశం ఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top