21 శతాబ్ధంలోని అతి తీవ్రమైన సమస్య స్థూలకాయమే.ఆ స్థూలకాయానికి సిసలైన పరిష్కారం.

స్థూలకాయంతో కదలికలు కష్టం కావడమే కాదు శరీరం పలురకాల దుష్ప్రభావాలకు గురవుతుంది. 21 శతాబ్ధంలోని అతి తీవ్రమైన సమస్య స్థూలకాయమే. శరీరాన్ని రోగగ్రస్తం చేయడమే కాకుండా అంతిమంగా ఇది మనిషి ఆయుష్షును తగ్గించివేస్తుంది.

ఎందుకొస్తుంది?

స్థూలకాయానికి, మౌలికంగా జీవన శైలి లోపాలు, ఆహారపు అలవాట్లే కారణంగా ఉంటాయి. అంటే అవసరానికన్నా ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం, ఆహారం తీసుకోవడానికి ఒక నిర్ధిష్టమైన సమయమేదీ పాటించకపోవడం, పగటిపూట అతిగా నిద్రించడం, నిరంతరం కూర్చుని ఉండే ఉద్యోగ వ్యాపారాలు, బొత్తిగా శరీర శ్రమ లేకపోవడం వంటి కారణాలే ప్రధానంగా ఉంటాయి. వీటికి తోడు కొందరికి జన్యుపరమైన కారణాలతో కూడా స్థూలకాయం రావచ్చు.

వైద్యపరమైన కారణాలు
మనం తీసుకునే ఆహారం సక్రమంగా జీర్ణమైతేనే అది శరీరానికి శక్తినిస్తుంది. అయితే కొంద రిలో జీవక్రియలేవీ సరిగా పనిచేయవు. ఫలితంగా కొవ్వు, మలిన పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. ఇది స్థూలకాయానికి దారి తీయడంతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు దారి తీస్తాయి. వీటితో పాటు థైరాయిడ్ సమస్యలు, హార్మోన్, బహిష్టు సమస్యలు మొదలవుతాయి. గర్భాశయం తీసివేసిన కారణంగా కూడా కొందరిలో ఈ సమస్యలు తలెత్తవచ్చు. కొందరిలో ఈ స్థితిలో రక్తహీనత సమస్యకూడా ఏర్పడుతుంది.

స్థూలకాయంతో చిక్కులు

స్థూలకాయంతో అధిక రక్తపోటు, మధుమేహం మాత్రమే కాదు, ఆస్తమా, కీళ్లనొప్పులు, గుండె జబ్బులు కూడా వస్తాయి. శరీరంలో కొవ్వు అతిగా పేరుకుపోవడం వల్ల శరీరంలోని అతి కీలక భాగాలైన గుండె, లివర్, కిడ్నీలు కూడా దె బ్బ తింటాయి. శరీరంలో అతిగా కొవ్వు పేరుకుపోయిన వారు ఇతరుల కన్నా 30 శాతం కన్నా ఎక్కువగా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది.

ఇవీ మా చికిత్సలు
వాస్తవానికి స్థూలకాయాన్ని తగ్గించడంలో ఆయుర్వేదం అత్యంత సురక్షిత వైద్య విధానం. ప్రపంచ ప్రసిద్ధిపొందిన ఆర్య వైద్య ఫార్మసీ లిమిటెడ్ (కోయంబత్తూర్)తో ఒప్పదం కుదర్చుకున్న మా మంజూష ఆయుర్వేద హాస్పిటల్ స్థూలకాయాన్ని శాశ్వతంగా తొలగించగలుగుతోంది. మూల దోషాలను తొలగించడం, పేరుకుపోయిన కొవ్వు, వ్యర్థపదార్థాలను శరీరం నుంచి తొలగించడం, స్థూలకాయపు దుష్ప్రభావాలను తొలగించడం ప్రధాన లక్ష్యాలుగా ఈ చికిత్సలు కొనసాగుతాయి.

ప్రత్యేకంగానే...

సమస్య స్థూలకాయమే అయినా, ఆ స్థితి ఏర్పడటానికి వ్యక్తి వ్యక్తికీ వేరు కారణాలు ఉంటాయి. అందుకే ఆయా వ్యక్తుల జీవన శైలి, ఆహారపు అలవాట్లు, జీవక్రియల పనితీరు, శరీర ప్రకృతి, దోషాల స్థితి, మొదటి నుంచి ఆరోగ్య పరిస్థితులు వీటన్నిటినీ ప్రత్యేకంగా పరీక్షి స్తాం. శరీర వ్యవస్థను సమూలంగా చక్కదిద్దడానికి కడుపులోకి కొన్ని మందులు కూడా ఇస్తాం. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, మలినాలనూ తొలగించడానికి ఉద్దేశించి ఆయుర్వేదంలో 150 థెరపీల దాకా ఉన్నాయి. వ్యక్తుల శరీర ధర్మాన్ని , వాత, పిత్త , కఫ దోషాలను అనుసరించి ఆ థెరపీలను ఎంపిక చేస్తాం. ఆయుర్వేద వైద్య చికిత్సలతో బరువు తగ్గడంతో పాటు శరీరం చక్కని ఆకృతి పొందుతుంది. వీటితో పాటు అధికరక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు నియంత్రణలోకి వస్తాయి. శరీరాన్ని బాహ్యంగా, అంతర్గతంగా పరిశుభ్రం చేయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. బరువు త గ్గించే క్రమంలో థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, ఆస్టియో పొరోసిస్ సమస్యలు తొలగిపోతాయి. వీటికి తోడు కండరాలు, ఎముకలు శక్తివంతమవుతాయి.

పలు విధానాల్లో...

వైద్య విధానాల్లోని కొన్ని ప్రత్యేక థెరపీలతో కేవలం నాలుగైదు వారాల్లో 5 నుంచి 10 కిలోల బరువు తగ్గుతారు. శరీర ఆకృతిలో 15 నుంచి 25 సెంటీ మీటర్లు తగ్గుతారు. మా హాస్పిటల్‌లో శరీర ఆకృతిని చక్కదిద్దే కొన్ని ప్రత్యేకమైన తైల మర్ధనలు ఉన్నాయి. ఈ చికిత్సలు తీసుకున్న తరువాత ఒక పరిపూర్ణ మైన ఆకృతి వారి సొంతమవుతుంది. చికిత్స అయిపోయిన తరువాత మరో మూడు మాసాల దాకా శరీరం బరువు అలా తగ్గుతూనే ఉంటుంది. అదే క్రమంలో శరీర ఆకృతి కూడా చక్కబడుతూనే ఉంటుంది. ఆ తరువాత మేము సూచించే విధానాలను అనుసరిస్తే, వారి శరీర బరువు, ఆకృతి, ఆశించిన రీతిలోనే నిలకడగా ఉంటాయి. 
డా. మంజుషా మంజుషా ఆయుర్వేదిక్ హాస్పిటల్, మాదాపూర్, హైదరాబాద్, ఫోన్ : 8978 222 777, 8978 222 888, 040-64507090.   
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top