ముల్లంగి ముక్కలను మెత్తగా పేస్ట్ చేసుకుని అందులో అయిదారు టీ స్పూన్ల పుల్లటి పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలపాటు చేస్తే ముఖంపైన మొటిమలు, రంధ్రాలు, నల్లమచ్చలు తగ్గి చర్మం కోమలంగా ఉంటుంది.