మొక్కజొన్న కొత్తిమీర పకోడీలు

From August 12, 2011
కావల్సినవి:
మొక్కజొన్న గింజలు - కప్పు, ఉల్లిపాయ- ఒకటి, సెగనపిండి- అరకప్పు, కొత్తిమీర- పావుకప్పు, అల్లం- చిన్నముక్క, పచ్చిమిర్చి- మూడు, ఉప్పు, కారం- రుచికి తగినంత, జీలకర్ర- అరచెంచా, నూనె- వేయించడానికి.

తయారీ:  
మొక్క జొన్నలను శుభ్రంగా కడిగి వడకట్టాలి. ఉల్లిపాయ ముక్కలను తరిగి పెట్టుకోవాలి. అల్లం, పచ్చిమిర్చిని తరిగి మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. ఇప్పుడు గిన్నెలో సెనగ పిండి తీసుకొని అందులో మొక్కజొన్నలు, ఉల్లిపాయ తురుగు, కొత్తిమీర, అల్లం పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, చిటికెడు కారం, జీలకర్ర వేయాలి. అలానే తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా కలపాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక పిండిని పకోడీల్లా వేయాలి. బంగారువర్ణంలోకి వచ్చాక దించేసి టిష్యూ కాగితం పరిచిన పళ్లెంలోకి తీసుకొని కొత్తిమీరతో అలంకరించుకొంటే సరిపోతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top