ఆపిల్ని ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అందులో నాలుగు టీ స్పూన్ల పచ్చిపాలు, అర టీ స్పూన్ బాదం ఆయిల్, అయిదారు చుక్కల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకి మాస్క్లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా చేస్తుంటే ముఖంపైన ఉన్న నల్లమచ్చలు క్రమంగా తగ్గి చర్మం మృదువుగా ఉంటుంది.