ముందుగా మైల్డ్ సబ్బుతో కాళ్లని శుభ్రంగా కడగాలి. తగినన్ని గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో టీ స్పూన్ ఉప్పు కలపాలి. ఆ నీటిలో కాళ్లను పెట్టి రసం పిండేసిన నిమ్మచెక్కలతో అరికాళ్లను రుద్ది 20 నిమిషాల తర్వాత తిరిగి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇప్పుడు మెత్తని టవల్తో కాళ్లని తుడిచి అయిదారు చుక్కల బాదం ఆయిల్ రాసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రెండు వారాలపాటు చేస్తే పాదాల పగుళ్లు తగ్గి ఆకర్షణీయంగా ఉంటాయి.