కావల్సినవి:
సగ్గుబియ్యం - కప్పు; నీళ్లు - నాలుగు కప్పులు; మరమరాలు - నాలుగు కప్పులు; పచ్చిమిర్చి ముద్ద - టేబుల్స్పూను; జీలకర్ర - చెంచా; తెల్లనువ్వులు - టేబుల్స్పూను; ఉప్పు - రుచికి తగినంత.
తయారీ:గిన్నెలో నీళ్లు తీసుకుని ఒక పొంగు వచ్చేదాకా మరిగించి సగ్గుబియ్యం వేయాలి. అవి పూర్తిగా ఉడికాక పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు జీలకర్ర, తెల్లనువ్వులు వేసి బాగా కలిపి దింపేయాలి. ఈ మిశ్రమం వేడి పూర్తిగా తగ్గాక మరమరాలు చేర్చాలి. ప్లాస్టిక్ కాగితంపై గరిటెతో వడియాల్లా వేసుకుని ఎండబెట్టాలి. కరకరలాడుతూ ఉంటాయివి.