ఈ సీజన్లో స్కిన్కి చెప్పలేనంత హాని కలుగుతుంది. చర్మం ఒకసారి పొడిబారిపోయి బిగదీసుకుపోయినట్లుంటే ఇంకోసారి జిడ్డుపట్టి బంకలు సాగుతుంటుంది. శ్రద్ధ చూపకపోతే సమస్యలు ఎదురవుతాయి కాబట్టి తక్కువ గాఢతగల ఫేస్వాష్తో ముఖం కడుక్కుని, రెండు మూడు నిమిషాల తర్వాత అంటే ఆ తడి ఆరకముందే మంచి మాయిశ్చరైజర్తో సున్నితంగా మర్దించాలి. అలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఇది వర్షాకాలం కదా, సన్స్క్రీన్ లోషన్లతో పనేముందనుకోకుండా ఎండలో బయటకు వెళ్లడానికి పది, పదిహేను నిమిషాల ముందుగా ముఖానికి, మెడకు, చేతులకు తప్పనిసరిగా సన్స్క్రీన్ లోషన్ పూయండి. ఎండలోనే ఎక్కువ సమయం గడపవలసి వస్తే ప్రతి మూడుగంటలకూ ఒకసారి అప్లై చేస్తూ ఉంటే మీ ముఖసౌందర్యం దెబ్బతినదు.