కావల్సినవి:
మినపప్పు- కప్పు, బియ్యంపిండి- రెండు కప్పులు, బెల్లం- అరకేజీ, పంచదార- పావుకేజీ, నూనె- అరకేజీ.
తయారీ:
ముందురోజు రాత్రి మినప్పప్పు, బియ్యం నానబెట్టుకొని మర్నాడు దోశ పిండిలా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. గంట అయ్యాక సాస్ బాటిల్లో పిండి తీసుకొని బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టి వేడయ్యాక బాటిల్తో జిలేబిలు వేసుకోవాలి. అవి ఎర్రగా వేగాక దించుకోవాలి. తరవాత బెల్లం, పంచదార కలిపి మునిగే వరకూ నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. తీగపాకం వచ్చాక దించి వేడివేడి జిలేబిలను అందులో వేయాలి. పాకం, జిలేబీలు రెండూ వేడిగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే జిలేబి పాకాన్ని పీల్చుకోదు.
మినపప్పు- కప్పు, బియ్యంపిండి- రెండు కప్పులు, బెల్లం- అరకేజీ, పంచదార- పావుకేజీ, నూనె- అరకేజీ.
తయారీ:
ముందురోజు రాత్రి మినప్పప్పు, బియ్యం నానబెట్టుకొని మర్నాడు దోశ పిండిలా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. గంట అయ్యాక సాస్ బాటిల్లో పిండి తీసుకొని బాణలిలో నూనె పోసి పొయ్యి మీద పెట్టి వేడయ్యాక బాటిల్తో జిలేబిలు వేసుకోవాలి. అవి ఎర్రగా వేగాక దించుకోవాలి. తరవాత బెల్లం, పంచదార కలిపి మునిగే వరకూ నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాలి. తీగపాకం వచ్చాక దించి వేడివేడి జిలేబిలను అందులో వేయాలి. పాకం, జిలేబీలు రెండూ వేడిగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే జిలేబి పాకాన్ని పీల్చుకోదు.