రోజూ యాపిల్ తిని డాక్టర్‌కి దూరంగా ఉండవచ్చు

రోజూ యాపిల్ తిని డాక్టర్‌కి దూరంగా ఉండమని అందరూ చెప్పేదే. రోజూ గ్లాసు యాపిల్ జ్యూస్ తాగండి పెరుగుతున్న మతిమరుపును తగ్గించుకోండి అంటున్నాయి కొత్త పరిశోధనలు. ముఖ్యంగా వృద్ధాప్యం మోసుకొచ్చే అల్జీమర్స్ వ్యాధికి యాపిల్ మంచి మందుగా పనిచేస్తుందం టున్నారు అధ్యయనకారులు. యాపిల్ పండులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు జ్ఞాపక శక్తి పెరగడానికి దోహదపడుతాయని తమ పరిశోధనలో తేల్చారు మసాచుసెట్స్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ థామస్ షియా. అసిటైల్‌కోలిన్ అనే రసాయనం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి.

అయితే యాంటి ఆక్సిడెంట్లు ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చని డాక్టర్ థామస్ పరిశోధనల్లో నిర్ధారణ అయింది. ఎలుకలపై ఆయన బృందం నిర్వహించిన అధ్యయనం మతిమరుపు నివారణలో యాపిల్ పండు ప్రాముఖ్యతను మరింత పెంచింది. యాపిల్‌లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు ఇందుకు దోహదపడుతాయని ధ్రువీకరించింది. అందుకే యాంటి ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే పండ్లను రోజూ తీసుకోవాలని ముఖ్యంగా యాపిల్ పండు గానీ యాపిల్ రసం గాని తీసుకుంటే మెదడు చురుకుదనం పెరుగుతుందని సూచిస్తున్నారు పరిశోధకులు. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top