ఎర్రటి దద్దుర్లు సోరియాసిస్‌గా మారతాయా?

కొందరి చర్మం మీద తరుచూ ఎర్రటి దద్దుర్లు లేదా బెందులు వచ్చి వాటికవే తగ్గిపోతాయి. అందుకే చాలా మంది వాటి పట్ల నిర్లక్ష్యంగానే ఉండిపోతారు. అయితే ఎక్కువగా అలా పదేపదే వస్తూ పోతున్నప్పుడు వాటిని తీవ్రంగానే పరిగణించాలి. ఒక్కోసారి ఈ దద్దుర్లు లేదా బెందులు సొరియాసిస్‌కు దారి తీయవచ్చు. తొలిదశలోనే సమస్యను గుర్తించి చికిత్సలు తీసుకుంటే సొరియాసిస్ రాకుండా ముందే అరికట్టవచ్చునంటున్నారు.

అప్పుడో ఇప్పుడో ఒంటి మీద ఏవో దద్దుర్లు, బెందులు రావడం, మళ్లీ వాటంతట అవే తగ్గిపోవడం కొందరికి బాగా అనుభవమే. స్వల్ప కాలమే ఉండి ఆ తరువాత వాటికవే మాయమైపోయే సమస్యలను సాధారణంగా ఎవరూ పటించుకోరు. నిజానికి ఈ లక్షణాలన్నీ శరీరంలో మునుముందు రాబోయే కొన్ని తీవ్ర వ్యాధులను తెలిపే సూచికలు. ప్రత్యేకించి ఈ దద్దుర్లు గానీ, బెందులు గానీ శరీరంలో పిత్త ప్రకృతి పెరగడం వల్ల వస్తుంటాయి. తొలిదశలో వీటికి చికిత్స తీసుకుంటే సరేసరి.

లేదంటే కొందరిలో ఇవి పలురకాల చర్మ వ్యాధులకు కొన్నిసార్లు ఇవి సొరియాసిస్ వ్యాధికి కూడా దారి తీయవచ్చు. దద్దుర్లు గానీ, బెందులు గానీ, అరుదుగా ఎప్పుడో ఒకసారి వచ్చి పోతే ఫరవాలేదు. అలాకాకుండా పదే పదే వచ్చిపోతున్నప్పుడు ఆ విషయాన్ని డాక్టర్ దృష్టికి తీసుకువెళ్లడం తప్పనిసరి. ఇవేమిటని పక్క వాళ్లు అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పకుండా దాటేస్తుంటారు. పైగా వారి మీద ఆసహనాన్నీ, ఆగ్రహాన్నీ వ్యక్తం చేస్తారు. చివరికి ఇవి తనమీదే తానే అసహనాన్ని పెంచుకునే పరిస్థితిలో పడదోస్తాయి.



అలర్జీగా మొదలై
ముందు అలర్జీగా మొదలై ఆ తరువాత ఎర్రటి బెందులు, దద్దుర్లు వస్తూ ఉంటాయి. అయితే దద్దుర్లు చాలా సార్లు అలా వచ్చి ఇలా తగ్గిపోవచ్చు. కానీ, ఎర్రటి కురుపుల్లా ఉండే బెందులు మాత్రం కొందరిలో కొన్ని గంటల దాకా కొనసాగవచ్చు. వాస్తవానికి శరీరంలో ఒక రక్షణ వ్యవస్థలో భాగంగా యాంటీ-హిస్టామిన్ వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే ఈ యాంటీ-హిస్టామిన్‌లు మరీ ఎక్కువగా ఉత్పత్తి అయినప్పుడు ఈ తరహా చర్మ సమస్యలు మొదలవుతాయి.

ఇలాంటి స్థితిలో 'అవిల్' మాత్రలు గానీ,' సెడ్రిజిన్' మాత్రలు గానీ వేసుకుంటే తాత్కాలికంగా తగ్గుముఖం పడతాయి. ఆ తరువాత ఎప్పుడో ఒకప్పుడు మళ్లీ వస్తూనే ఉంటాయి. ప్రత్యేకించి రామగుండం, మహబూబ్ నగర్, అనంతపూర్, హైదరాబాద్ వంటి అధిక ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు, అలాగే విజయవాడ, విశాఖపట్నం వంటి సముద్ర తీరప్రాంత వాసుల్లో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. బెందులు ఎర్రగా తయారవుతాయి. వేసవిలో మరికాస్త ఎక్కువవుతాయి.



బెందులు తరుచూ వస్తున్నప్పుడు చర్మం తన వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతుంది. ఫలితంగా వాతావరణంలో ఏ కాస్త మార్పు వచ్చినా తట్టుకోలేని స్థితి ఏర్పడుతుంది. ఒక దశలో ఇవన్నీ ఏదో ఒక రకం చర్మ వ్యాధులకు దారి తీస్తాయి. వీటిలో ముఖ్యంగా 60 శాతం చర్మ వ్యాధులు సొరియాసిస్ గా మారే ప్రమాదం ఉంది. నిజానికి బెందుల వల్ల సొరియాసిస్ రాదు. బెందులతో చర్మం వ్యాధినిరోధక శక్తి కోల్పోయిన కారణంగా సొరియాసిస్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. బెందులు గానీ, దద్దుర్లు గానీ వచ్చినప్పుడు దురద, మంటతో పాటు ఎండకు వెళ్లితే తట్టుకోలేని స్థితి ఏర్పడుతుంది. వాతావరణం చల్లబడినప్పుడు కాస్త తగ్గుముఖం పట్టి ఎండల్లో ఎక్కువవుతుంది. వంకాయ, గోంగూర లాంటివి తిన్నప్పుడు ఎక్కువవుతుంది.

పిత్తాన్ని తొలగిస్తూ...
ఈ బెందులు దద్దుర్లు రావడానికి పిత్త ప్రకృతే మూలం. ఇలాంటి వారిలో మలబద్ధకం సమస్య ఉంటుంది. కడుపు ఉబ్బరం, మంట ఉంటాయి. ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేయకుండా వీరు ఆయుర్వేద డాక్టర్‌ను కలవడం ఉత్తమం. ఈ స్థితిలో వెంటనే విరేచన చికిత్స చేయడం చాలా అవసరం. సమస్యకు పిత్తం పెరగడమే కారణం కాబట్టి పిత్తాన్ని హరించే చికి త్సలు అంటే విరేచన చికిత్సలు అవసరమవుతాయి. చికిత్స తీసుకుంటున్నా సూర్యరశ్మిలోకి వెళ్లకుండా జాగ్రత్తపడటం కూడా అసవరమే.



ఒకవేళ తప్పనిసరై వెళ్లవలసి వస్తే, వెళ్లే ముందు శరీరం మొత్తంగా చందనాది తైలాన్ని రాసుకోవడం మేలు.విరేచన చికిత్సతో శరీరంలోని సొరియాసిస్ కారకమైన పిత్తం త్వరగానే తగ్గుతుంది. ఆ తరువాత శరీరంలో చల్లదనం తేవడానికి రక్తశుద్ధి చేయడం అవసరం.అందుకు సర్వాంగ తక్రదార చికిత్స బాగా తోడ్పడుతుంది.

ఈ చికిత్స కోసం పాలలో రక్తశోదక ద్రవ్యాలు, వర్ణప్రసాదక ద్రవ్యాలు వేసి మజ్జిగలా చేస్తాం. ఈ మజ్జిగను తలనుంచి బొటనవేలి దాకా ధారలా పోస్తాం. దీనివల్ల శరీరమంతా శీతల తత్వాన్ని పొంందుతుంది. ఆ వెంటనే శరీరంలోని కణజాలమంతా చైతన్యవంతమవుతుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. వీటితో పాటు ఆర్‌కె లేహ్యం, స్నేహపానం, విరేచనం, పంచకర్మ చికిత్సలు కూడా చేస్తే బెందులు , దద్దుర్లు పూర్తిగా తగ్గిపోయి, మునుముందు సొరియాసిస్‌కు అసలు తావే లేకుండా పోతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top