చర్మం రంగును మెరుగుపరచడంలో నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. రెండు టీ స్పూన్ల నిమ్మరసం, రెండు టీ స్పూన్ల కీరా జ్యూస్, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్లను తీసుకుని అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ముందుగా చన్నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత మిశ్రమాన్ని అప్లై చేయాలి. వేళ్ళతో నెమ్మదిగా 5 నుంచి 10 నిమిషాలపాటు మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. స్నానానికి వెళ్ళే ముందు ఈ చిట్కా పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల చర్మం ఎంతో ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంటుంది.