కృత్రిమ కన్ను వచ్చేసింది మీకు తెలుసా?

అంధులు కూడా చూసేందుకు ఉపయోగపడే కృత్రిమ కన్ను పరీక్షలన్నీ దాటుకుని ఆమోదాన్ని పొందింది. ఈ పరికరం పూర్తి సురక్షితమని పరీక్షలలో తేలింది. దాదాపు మూడేళ్ల పాటు దీనిపై చేసిన పరిశోధనలలో, అంచనాలను మించి తమను సంతృప్తి పరిచినట్లు వైద్య నిపుణులు తెలిపారు. రెటినా ఇంప్లాంట్లు కళ్లజోడు మీద ఏర్పాటుచేసిన కెమెరాతో అనుసంధానమై పనిచేస్తాయి. రెటినాకు సమీపంలో ఏర్పాటుచేసిన చిప్‌లోకి కెమెరా సంకేతాలను పంపుతుంది.

ఆ చిప్ రెటినా కణాలను ఉత్తేజపరిచి చూపు వచ్చేలా చేస్తుంది. ప్రాథమిక పరీక్షలలో 30 మంది అంధుల జీవితాల్లో వెలుగులు వచ్చాయి. రెటీనా వైఫల్యంతో ఇంగ్లండ్‌లో అంధులైన 20వేల మందికి ఈ కృత్రిమ కంటితో చూపు తెప్పించవచ్చని వైద్యులు ఆశిస్తున్నారు. దీంతో ఎంత రిజల్యూషన్ వస్తుందో అనుకున్నాం గానీ, ఆశ్చర్యకరంగా.. అది చాలా బాగుందని ఆక్స్‌ఫర్డ్ కంటి వైద్యశాలకు చెందిన కంటి శస్త్ర చికిత్స నిపుణుడు రాబర్ట్ మెక్‌లారెన్ తెలిపారు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top