రాణా, శ్రియలను విడదీసిన బిపాసా?

బాలీవుడ్ బామ బిపాసా బసు కారణంగా ఐదేళ్ల బంధాన్ని శ్రియా శరన్, దగ్గుబాటి రాణా తెంపేసుకున్నారు. రాణా, శ్రియా విడిపోయినట్లు టాలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. దమ్ మారో దమ్ సినిమా షూటింగ్ సందర్భంగా రాణా, బిపాసా బసు దగ్గరయ్యారని తెలిసిన శ్రీయా ఉడికిపోయి రాణాకు దూరమైనట్లు చెబుతున్నారు. రాణాపై శ్రియాకు పూర్తిగా నమ్మకం పోయిందట. అంతేకాదు, బిపాసా తన బాయ్ ఫ్రెండ్ జాన్ అబ్రహంకు కూడా పూర్తిగా దూరమయ్యారనే వార్తతో రాణా, బిపాసాల మధ్య సంబంధం ఉన్నట్లు పూర్తిగా ధ్రువపడిందని శ్రియా అంటోందట.


తమ మధ్య గల సంబంధంపై రాణా గానీ శ్రియా గానీ ఓ రోజు కూడా బహిరంగ పరచలేదు. అయితే వారి మధ్య సంబంధం గురించి అందరికీ తెలుసు. ఇప్పుడు వారిద్దరి మధ్య సంబంధం తెగిపోయిందని అంటున్నారు. శ్రియా ఇంకా రాణా కుటుంబ సభ్యులకు సన్నిహితంగానే మెలుగుతోంది. కానీ రాణా, శ్రియా మాత్రం దాని గురించి ఇప్పటి వరకు ఏమీ మాట్లాడుకోలేదని చెబుతున్నారు.

రాణాతో సంబంధాలపై వస్తున్న వార్తలపై బిపాసా బసు ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. తనకు కొంత సమయం ఇచ్చి గౌరవించాలని ఆమె అంటోంది. రాణా బాలీవుడ్‌కు కొత్తవాడని, బచ్చే ్యే హాసీనోలో రణబీర్ కపూర్ మాదిరిగా, ఆ దేఖే జరాలో నీల్ నితిన్ ముఖేష్ మాదిరిగా తనకు దమ్ మారో దమ్‌లో రాణా అని ఆమె అంటోంది. కొత్తవారు ఇబ్బందికి గురి కాకుండా చూడాల్సిన అవసరం ఉందని, ఆ విధంగా మాత్రమే రాణాతో తనకు సంబంధమని ఆమె అంటోంది. నీల్, రణబీర్‌లతో కూడా తన స్నేహం ఉందని, అలాగే రాణాను ఎందుకు అనుకోరని ఆమె అంటోంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top