కావలసిన పదార్థాలు:
బియ్యం - 2 కప్పులు, పెసర్లతో పాటు మినప్పప్పు, శనగపప్పు, కందిపప్పు - పావు కప్పు చొప్పున, (గింజలు తీసిన) ఎండుమిర్చి - 2, రవ్వ - పావు కప్పు, ఇంగువ - అర టీ స్పూను, దోసకాయ తరుగు - 1 కప్పు, పుదీనా తరుగు - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - కాల్చడానికి సరిపడా.తయారుచేసే విధానం:
బియ్యంతో పాటు పప్పులు, రవ్వ కలిపి 3 గంటలు నానబెట్టాలి. మిక్సీలో ఎండుమిర్చి పొడి చేసుకుని నానిన దినుసులు, పుదీనా ఆకులు వేసి, అవి మెత్తబడ్డాక ఇంగువ, ఉప్పు, దోసముక్కలు వేసి రుబ్బుకోవాలి. అవసరమైతే నీరు కలుపుకోవచ్చు. తర్వాత దోశల్లా పోసుకోవాలి. పుదీనా దోశల్లోకి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది.