కాబోయే తల్లులు సరిగా తినకుంటే పిల్లలకు డయాబెటిస్

గర్భం ధరించిన మహిళలకు డాక్టర్లు ఒక కొత్త జాగ్రత్త చెబుతున్నారు. వీరు గర్భంతో ఉండగా సమతులాహారం తీసుకోకపోతే.. పుట్టే పిల్లలకు పెద్దయ్యాక డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని తెలిసింది. గర్భంతో ఉన్న మహిళ అవసరమైన ఆహారం తీసుకోకపోతే.. కడుపులో ఉండే బిడ్డలో రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించే జన్యువు ఒకటి పని చేయకుండా ఆగిపోతుందట.

దీని కారణంగా వారికి పుట్టే పిల్లలు పెరిగి పెద్దయ్యాక వారికి టైప్-2 డయాబెటిస్ సోకే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఎలుకల్లో జరిగిన ఒక పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మనుషుల్లోనూ ఆ జన్యువు ఉండడంతో ఆ ప్రమాదం మనకు కూడా తప్పదని నిపుణులు చెబుతున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top