బాలీవుడ్ తారాగణం కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ మరల జంటగా నటిస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌలి తెలుగు సినిమా 'మగధీర' హిందీ రీమేక్లో వారు నటిస్తున్నారు. ఇది జానపదగాధపై ఆధారపడి తీస్తున్న చిత్రం. రణబీర్ ముఖ్యభూమిక పోషిస్తున్నారు.తెలుగులో చరణ్ పోషించిన పాత్ర పోషిస్తున్నారు. కత్రినా ఆయన సరసన నాయికగా నటిస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం హృతిక్ రోషన్, షాహిద్ కపూర్లను అంతకు ముందు సంప్రదించినప్పటికీ వారు నిరాకరించటంతో చివరకు రణబీర్, కత్రినాలను తీసుకున్నారు.