విద్యార్థులకు మంచి మార్కుల కోసం.....జాగ్రత్తలు

విద్యార్థులకు పరీక్షలు దగ్గరపడుతున్నాయి. పుస్తకాలతో కుస్తీ పట్టడం మొదలైంది. సంవత్సరమంతా చదివిన చదువు ఫలితం ఇప్పుడు జరిగే పునశ్చరణ పైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి.

  • ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్లు, మేలురకం కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లతో కూడిన మంచి పోషక విలువలు కలిగిన సంతులిత ఆహారం సరైన వేళకు తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు సమృద్ధిగా తినాలి.
  • ఆహారాన్ని అతిగా ఒకేసారి తినడం వల్ల నిద్ర వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినడం, తగినన్ని నీళ్లు తాగడం అవసరం.
  • రాత్రుళ్లు నిద్ర మేల్కొనాలనే ఉద్దేశంతో కాఫీ, టీలు మితిమీరి సేవించడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాక సామర్థ్యానికి తగిన ప్రతిభా పాటవాలు ప్రదర్శించలేకపోవచ్చు.
  • ఫాస్ట్‌ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఐస్‌క్రీమ్స్, ఆయిల్‌ఫుడ్స్ బాగా తగ్గించుకోవాలి. అధిక ఒత్తిడికి గురి కాకుండా ఉండాలి.
  • తగినంత నిద్ర అంటే కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి.
  • గంటలకొద్దీ విశ్రాంతి లేకుండా చదవకుండా మధ్య మధ్యలో కాస్త అంటే 5-10 నిమిషాల విరామం అవసరం. యోగా, ధ్యానం వంటివి కూడా మేలు చేస్తాయి.
  •  వీటికి తోడుబ్రహ్మీవటి ఉదయం, రాత్రి ఒక మాత్ర చొప్పున, అశ్వగంధతో తయారయ్యే స్ట్రెస్‌విన్ క్యాప్సుల్స్ పూటకు ఒకటి చొప్పున 2 పూటలు, బ్రెంటో టాబ్లెట్లు ఉదయం, సాయంత్రం ఒకటి చొప్పున, శంఖపుష్టి సిరప్ రోజూ రెండు సార్లు రెండు చెంచాల వంతున, అతి మధురంతో తయారయ్యే యష్టమధు క్యాప్సుల్స్ రోజూ రెండుచొప్పున..వీటిలో ఏదో ఒకటి తీసుకుంటే జ్ఞాపకశక్తి, ధారణ, ప్రతిభాశక్తి, ఏకాగ్రత, మేధాశక్తి, మనోధైర్యం పెరుగుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top