కావలసిన పదార్దాలు :
మినప్పప్పు: కప్పుబియ్యం: రెండు కప్పులు
అన్నం లేదా అటుకులు: కొద్దిగా
మెంతులు: టీస్పూను
సెనగపప్పు: 2 టేబుల్స్పూన్లు
చీజ్: 100గ్రా
క్యారెట్ తురుము: అరకప్పు
పచ్చిమిర్చితురుము: పావుకప్పు
ఉప్పు: తగినంత
నూనె లేదా నెయ్యి: సరిపడా
తయారుచేసే విధానం :
ముందురోజే మినప్పప్పు, బియ్యం, మెంతులు, సెనగపప్పు ఎనిమిది గంటలు నానబెట్టుకుని రుబ్బుకుని ఉంచాలి. రుబ్బేటప్పుడు కాస్త అన్నం లేదా నానేసిన అటుకులు కూడా వేయాలి. ఉప్పు కలిపి పిండిని పులియనివ్వాలి.మర్నాడు మామూలుగానే పెనంమీద దోశ వేసుకుని నూనె లేదా నెయ్యి వేస్తూ కాలనివ్వాలి. కాస్త కాలిన తరవాత చీజ్తురుము, క్యారెట్తురుము, పచ్చిమిర్చితురుము పైన చల్లి ఏదైనా చట్నీతో వేడివేడిగా వడ్డించాలి.