కూరగాయల కిచిడీ

కావల్సినవి: 
బియ్యం- రెండు కప్పులు
పెసరపప్పు- కప్పు
క్యారెట్లు- రెండు
బీన్స్‌- పది
క్యాబేజీ తురుము- కప్పు
బఠాణీలు- అరకప్పు
దాల్చినచెక్క- చిన్నముక్క
ఉప్పు- రుచికి తగినంత
లవంగాలు- ఐదు
పచ్చిమిర్చి- మూడు
జీలకర్ర- చెంచా
ఆవాలు- చెంచా
అల్లం వెల్లుల్లి ముద్ద- చెంచాన్నర
ఉల్లిపాయలు- మూడు
పసుపు- చిటికెడు
గరంమసాలా-చెంచా
నూనె- పావుకప్పు

కావల్సినవి: 
 బియ్యం, పెసరపప్పు కడిగి ఒక గంటపాటు నానబెట్టాలి. క్యారెట్‌, బీన్స్‌, ఉల్లిపాయ ముక్కలు తరిగి పక్కన పెట్టాలి. కుక్కర్‌లో నూనె పోసి పొయ్యి మీద పెట్టాలి. వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటలాడాక దాల్చిన చెక్క, పచ్చిమిర్చి. అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు వేసి కలియతిప్పాలి. ఇప్పుడు కూరగాయ ముక్కలు, బఠాణీలు వేసి మగ్గించి సన్నటి సెగ ఉంచాలి. తరవాత బియ్యం, పప్పు వేసి పదినిమిషాలు వేయించాక ఐదున్నర కప్పుల నీళ్లు పోసి ఉప్పు వేసి మూతపెట్టాలి. నాలుగు విజిళ్లు వచ్చాక దించేస్తే చాలు. వేడివేడి కూరగాయల కిచిడీని సాంబారు, బంగాళాదుంప కుర్మాతో తింటే భలే రుచిగా ఉంటుంది. 
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top