మానవ శరీరంలో మార్పులను అనుక్షణం గమనిస్తూ తీవ్ర అనారోగ్యం వచ్చే ప్రమాదం ఉంటే ముందే హెచ్చరించే 'బాడీ చిప్'ను బెంగళూరు శాస్త్రవేత్తలు రూపొందించారు. విశాఖలో గీతం వర్సిటీ నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు హాజరైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) శాస్త్రవేత్త ప్రొఫెసర్ కేపీజే రెడ్డి గురువారం ఈ విషయం తెలిపారు. ప్రముఖ ఐటీ కంపెనీ ఐబీఎంతో కలసి ఈ చిప్ తయారు చేశామని, దీన్ని శరీరంలో ప్రవేశపెట్టాకా, ఆ మనిషి ప్రపంచంలో ఎక్కడ సంచరిస్తున్నా సెన్సర్ల ద్వారా ఆరోగ్య పరిస్థితులు అనుసంధానం చేసిన కేంద్రానికి చేరతాయని తెలిపారు.