పంచరత్న పాయసం


కావల్సినవి:
మినప్పప్పు, సెనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు - అన్నీ కలిపి అరకప్పు; బియ్యం - అరకప్పు; కొబ్బరిపాలు - రెండు కప్పులు; కాచిన పాలు - రెండు లీటర్లు; నెయ్యి- అర కప్పు; జీడిపప్పు, ఎండుద్రాక్ష - అరకప్పు; పచ్చికోవా - పావుకప్పు; బెల్లం తురుము - ముప్పావు కప్పు; యాలకుల పొడి - చెంచా.

తయారీ: 
నాలుగు పప్పులు, బియ్యం.. అన్నింటినీ చెంచా నెయ్యిలో దోరగా వేయించుకోవాలి. కాస్త చల్లారాక.. మిక్సీలో వేసి బరకగా పొడి చేసుకోవాలి. ఈ పొడిలో అరలీటరు పాలు కలిపి కుక్కర్‌లో మూడు కూతలు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఆ తరవాత మరోసారి కలిపి మిగిలిన పాలు, కొబ్బరి పాలు, కోవా, యాలకుల పొడి వేసి సన్నని మంటపై ఉంచి మధ్యమధ్యలో కలపాలి. కాస్త చిక్కగా అయ్యాక బెల్లం తురుము చేర్చాలి. ఇప్పుడు నెయ్యిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి పాయసంలో వేసి దింపేయాలి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top