మెంతి పులిహోర


కావల్సినవి: 
బియ్యం - రెండు కప్పులు; తరిగిన మెంతికూర - కప్పు; పచ్చిమిర్చి - ఆరు; ఎండుమిర్చి - మూడు; మినప్పప్పు, సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు - అన్నీ రెండు చెంచాల చొప్పున; వేరు సెనగపప్పు - పావుకప్పు; నిమ్మకాయలు - నాలుగు (రసం తీసుకోవాలి); నూనె - పావుకప్పు; ఉప్పు - రుచికి సరిపడా.

తయారీ: 
 మెంతికూరను ఉడికించుకోవాలి. మెంతికూర నీటితోనే అన్నం వండాలి కాబట్టి.. అది నాలుగుకప్పులు వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు మెంతికూరను మరో కప్పులోకి వడకట్టి ఆ నీటిలో కడిగిన బియ్యం వేసి పొడిపొడిగా అన్నం వండి తగినంత ఉప్పు చేర్చి.. వెడల్పాటి పాత్రలో ఆరనివ్వాలి. ఇప్పుడు బాణలిలో చెంచా నూనె వేడి చేసి మెంతికూరను బాగా వేయించాలి. చిటికెడు ఉప్పు వేస్తే.. చేదు పోతుంది. దీన్ని అన్నంలో వేసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నూనె వేడి చేసి ఎండుమిర్చి, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, తాలింపు దినుసులన్నింటినీ వేయించి.. అన్నంపై వేయాలి. చివరగా నిమ్మరసం చేర్చి.. బాగా కలిపితే చాలు. ఘుమఘుమలాడే మెంతి ఆకు పులిహోర సిద్ధం.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top