రజనీ సోదరిగానా..ఛా.....ఛా..... మాధురి

తనకు సరైన పాత్ర లభించకపోవటంతో మెగాస్టార్‌ రజనీకాంత్‌ సరసన నటించేందుకు తిరస్కరించినట్లు బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ తెలిపారు. 43 ఏళ్ల ఈనటికి రజనీకాంత్‌ చిత్రం 'రాణా'లో అవకాశం ఇచ్చారు. రజనీతో నటించేందుకు ఇష్టమే అయినప్పటికీ ఆయన సోదరిగా చిత్రంలో నటించేందుకు తనకు ఇష్టం లేకపోయిందని ఆమె ట్విట్టర్‌ వెబ్‌సైట్‌లో రాశారు. 'రాణా' తమిళ చారిత్రక నేపధ్యంలో తీస్తున్నారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రజనీతో పాటు దీపికా పదుకునే, సోను సూద్‌ నటిస్తున్నారు. ఆషర్‌ పిక్చర్‌ ప్రొడక్షన్స్‌, ఇరోస్‌ ఇంటర్నేషనల్‌ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గతంలో అంటే 1987లో 'ఉత్తర్‌-దక్షిణ్‌' చిత్రంలో రజనీ సరసన మాధురీ నటించారు.

ఇప్పుడు దీనిని తెలుగులోను హిందీ లోను ఏకకాలంలో పునర్‌నిర్మిస్తున్నారు. 2012 కల్లా చిత్రం విడుదల కావచ్చు. మాధురి ప్రస్తుతం టివి రియాల్టీషో ' ఝలక్‌ దిఖలాదే' లో నటిస్తున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top