శ్రీదేవి నిజ్జంగా వచ్చేస్తోంది!


సినీనటి శ్రీదేవి అభిమానులందరికీ ఒక శుభవార్త! అదేంటంటే.. శ్రీదేవి త్వరలోనే సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇవ్వబోతోంది. ఎన్నాళ్లుగానో ఆమె అభిమానులు ఎదురుచూస్తున్న ఈ ఘడియ రానే వచ్చింది. శ్రీదేవి రీ-ఎంట్రీ గురించి ఇప్పటి వరకు చాలాసార్లు అనేక పుకార్లు షికార్లు చేసినా.. ఆమె మాత్రం తాను మళ్లీ నటించబోతున్నట్లు ఇప్పటి వరకు ఎక్కడా నోరు విప్పలేదు. బాలీవుడ్ తాజా సమాచారం ప్రకారం.. బిగ్‌బి అమితాబ్ నటించిన 'పా' చిత్ర దర్శకుడు ఆర్.బాల్కీ త్వరలో నిర్మించనున్న చిత్రం ద్వారా శ్రీదేవి బాలీవుడ్ అభిమానుల్ని అలరించబోతోంది.

నిజానికి శ్రీదేవి రీ-ఎంట్రీ ఎప్పుడో జరగాల్సింది. అమితాబ్‌బచ్చన్ సరసన నటించాల్సిందిగా యష్‌చోప్రో ఫిలింస్ నుంచి శ్రీదేవికి మూడేళ్ల క్రితమే ఆఫర్ వచ్చింది. అయితే ఆమె భర్త బోనీ కపూర్ ఇందుకు ఒప్పుకోలేదు. కారణం.. శ్రీదేవి బాలీవుడ్ రీ-ఎంట్రీ సొంత బేనర్‌పై తాను నిర్మించబోయే చిత్రం ద్వారానే జరగాలని ఆయన అభిలాష. ఆ దిశగా 'మిస్టర్ ఇండియా'కి సీక్వెల్ చేయాలనే ప్రయత్నం చేశాడు కానీ, ఫలించలేదు. అందుకే శ్రీదేవి రీ-ఎంట్రీ విషయంలో ఇంత జాప్యం జరిగిందని బాలీవుడ్ వర్గాలలో వినిపిస్తోంది.

ప్రస్తుతం భార్య గౌరీ షిండే దర్శకత్వంలో ఆర్.బాల్కీ నిర్మిస్తున్న చిత్రంలో శ్రీదేవి నటిస్తోందనీ, ఇందులో ఆమెది ఇంగ్లీషు అసలేమాత్రం తెలియని యువతి పాత్ర అనీ, అలాంటి అమెకి బాగా చదువుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుందనీ, చివరికి తన సమస్యని ఎలా అధిగమించి తన భర్త మెప్పుకోలు పొందిందనేది చిత్ర కథా సారాంశమనీ సమాచారం. ఈ చిత్ర కథ శ్రీదేవికి బాగా నచ్చిందట. ఈ పాత్ర పోషణ నిమిత్తం శరీరాకృతిని నాజూగ్గా మలచుకునేందుకు జిమ్‌కి సైతం వెళ్తోందంట.

అంతేకాదు, తన బాలీవుడ్ రీ-ఎంట్రీ విషయాన్ని కొన్నాళ్లు రహస్యంగా ఉంచాల్సిందిగా శ్రీదేవి తన బంధువులు, స్నేహితులను కూడా కోరిందట. ఈ విషయమై ఆమె భర్త బోనీ కపూర్ కూడా పెదవి విప్పడం లేదట. అయినా నిప్పు లేనిదే పొగ వస్తుందా? పొగంటూ వచ్చాక అది ఎవరి కంటా పడకుండా ఆగుతుందా? శ్రీదేవి రీ-ఎంట్రీ విషయమూ ఇంతే!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top