గోవా సుందరి ఇలియానా చాలా సినిమాల్లో నటిస్తూ యమా బిజీగా ఉంటోంది. నటనను ఎంజాయ్ చేస్తోంది. అయితే డ్యాన్స్ చేయమంటే మాత్రం ఇలియానాకు ఎక్కడలేని టెన్షన్ వస్తుంది. నిజమండి... ఒక సోషల్నెట్వర్కింగ్ సైట్లో ఇలియానా స్వయంగా అంగీకరించింది.
''జూ.ఎన్టీఆర్తో నటిస్తున్న 'శక్తి' సినిమా చివరి పాట చిత్రీకరణ కోసం నేను మళ్లీ టాలీవుడ్లోకి అడుగుపెట్టాను. పాటలో నర్తించమని చెబితే చాలు... నాకు ఎక్కడ లేని టెన్షన్ వస్తుంది'' అని ఆమె రాసుకొచ్చింది. కానీ చానాళ్ల తర్వాత నటిస్తున్న తమిళ చిత్రం దగ్గరకి వచ్చేసరికి ఆమెలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నన్బన్' చిత్రంలో నటించేటప్పుడు తన అనుభవాలను గురించి కూడా ఇలియానా రాసింది. ''శంకర్గారి దర్శకత్వంలో నటించటం చాలా గొప్పగా ఉంటుంది. భారతదేశంలో ప్రముఖ దర్శకుల్లో ఒకరైన శంకర్ సెట్లో అంత కూల్గా ఉంటారని నేను ఊహించలేదు. తమిళంలో ఒకటి, రెండు పదాలు మాట్లాడగలుగుతున్నాను! త్వరలో తమిళంలో ధారాళంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను'' అని ఇలియానా చెప్పుకొచ్చింది.
''జూ.ఎన్టీఆర్తో నటిస్తున్న 'శక్తి' సినిమా చివరి పాట చిత్రీకరణ కోసం నేను మళ్లీ టాలీవుడ్లోకి అడుగుపెట్టాను. పాటలో నర్తించమని చెబితే చాలు... నాకు ఎక్కడ లేని టెన్షన్ వస్తుంది'' అని ఆమె రాసుకొచ్చింది. కానీ చానాళ్ల తర్వాత నటిస్తున్న తమిళ చిత్రం దగ్గరకి వచ్చేసరికి ఆమెలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'నన్బన్' చిత్రంలో నటించేటప్పుడు తన అనుభవాలను గురించి కూడా ఇలియానా రాసింది. ''శంకర్గారి దర్శకత్వంలో నటించటం చాలా గొప్పగా ఉంటుంది. భారతదేశంలో ప్రముఖ దర్శకుల్లో ఒకరైన శంకర్ సెట్లో అంత కూల్గా ఉంటారని నేను ఊహించలేదు. తమిళంలో ఒకటి, రెండు పదాలు మాట్లాడగలుగుతున్నాను! త్వరలో తమిళంలో ధారాళంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తాను'' అని ఇలియానా చెప్పుకొచ్చింది.