తెలుగు సినిమాకు రాజ భోగం!?


తెలుగు సినిమాకు మళ్లీ రాజభోగం వస్తుందో లేదో మనకు తెలియదు కాని.. ఇదే నెలలో ‘రాజు’ పేరు గల నాలుగు సినిమాలు విడుదల కాబోతుండడం సహజంగానే అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తోంది!చాలా కాకతాళీయంగా రాజు పేరును ఇముడ్చుకున్న నాలుగు చిత్రాలు విడుదలవుతున్నాయి. వీటిలో మొదటగా చెప్పుకోవాల్సింది ‘రాజ్‌’. సుమంత్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, విమలారామన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వి.ఎన్‌.ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కుమార్‌ బ్రదర్స్‌ నిర్మిస్తున్నారు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో సునీల్‌ హీరోగా రూపొందుతున్న ‘కథ-స్క్రీన్‌ప్లే -దర్శకత్వం: అప్పల్రాజు’.

కలర్స్‌ స్వాతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం కూడా ఈనెలలోనే విడుదల కాబోతోంది. ఇకపోతే, అలీ టైటిల్‌ పాత్ర పోషిస్తున్న ‘తిమ్మరాజు’ కూడా ఇదే నెలలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.‘యమలీల’ వంటి సూపర్‌హిట్‌ ఇచ్చి, ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించిన అలీ, కొంత విరామం తీసుకుని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.ఇక పై చిత్రాల కంటే ప్రముఖంగా చెప్పుకోవాల్సింది.. మంచు విష్ణు హీరోగా నటిస్తూ, తనే నిర్మించిన ‘వస్తాడు నా రాజు’ గురించి. ఈ చిత్రం కూడా ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన తాప్సీ ఈ చిత్రంలో నటిస్తోంది.మరి ఈ నలుగురు రాజుల్లో ఏ రాజు తెలుగు చలన చిత్రమనే రాజ్యంలో విజయపతాకం ఎగురవేస్తాడో వేచి చూడాల్సిందే!
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top