బ్రెడ్‌ దోశ


కావల్సినవి: 
బ్రెడ్‌ ముక్కలు - మూడు కప్పులు
గోధుమరవ్వ - రెండు కప్పులు
మైదా - కప్పు
ఉప్పు - తగినంత
మొక్కజొన్న పిండి - అరచెంచా
మజ్జిగ - రెండు కప్పులు
పచ్చిమిర్చి - మూడు
జీలకర్ర- అరచెంచా
నూనె- కప్పు.


తయారీ: 
 ముందు బ్రెడ్‌ ముక్కల అంచులు తీసేయాలి. ఇప్పుడు గోధుమరవ్వ, మైదాపిండి, బ్రెడ్‌ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకొని, మజ్జిగతో పిండిలా కలిపి పెట్టుకోవాలి. ఇది గంటసేపు నానాలి. తరవాత అందులో మొక్కజొన్న పిండి, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర కలిపి దోశల పిండిలా తయారు చేసుకోవాలి. తరవాత పొయ్యి మీద పెనం పెట్టి అది వేడయ్యాక పలుచగా దోశ వేసుకొని చుట్టూ నూనె వేయాలి. రెండువైపులా కాల్చితే సరిపోతుంది. కమ్మని బ్రెడ్‌ దోశ సిద్ధం. ఈ వేడివేడి దోశల్ని కొబ్బరి చట్నీతో కలిపి తింటే ఆ రుచే వేరు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top