మైదా: 2 టీస్పూన్లు
బొంబాయిరవ్వ: 2 టీస్పూన్లు
కొబ్బరితురుము: 2 టీస్పూన్లు
పాలు: లీటరు
పంచదార: కప్పు
బాదంపొడి: 4 టీస్పూన్లు
నెయ్యి: 5 టీస్పూన్లు
తయారుచేసే విధానం :
పాలవిరుగుడులో మైదా, బొంబాయిరవ్వ వేసి కలపాలి ఉండలుగా చేయాలి. తరవాత వీటిని చేతివేళ్లతోనే బిళ్లలుగా వత్తాలి. మందపాటి గిన్నెలో పంచదార వేసి కప్పు నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఇప్పుడు ఇందులో పాలవిరుగుడుతో చేసిన బిళ్లలు వేసి ఉడికించాలి. విడిగా మరో గిన్నెలో పాలు పోసి సుమారు సగం అయ్యేవరకూ మరిగించాలి. తరవాత బాదంపొడి, కొబ్బరితురుము వేసి దించాలి. ఇందులో పంచదార పాకం పోసి బాగా కలపాలి. తరవాత పాకంలో ఉడికిన రసమలై కూడా వేసి అందించాలి.