పేరుకు తగ్గట్టు రాక్ఫోర్ట్ టెంపుల్... పర్వతంపై 83 మీటర్ల ఎత్తున శిలలో అత్యద్భుతంగా మలచబడింది. ఈ కొండపై మొత్తం మూడు దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయ సముదాయాల నిర్మాణం పల్లవుల హయాంలో ప్రారంభమైనప్పటికీ... ఆ తరువాత విజయనగర రాజుల ఆధ్వర్యంలో మధురై నాయకులు వీటి నిర్మాణాన్ని పూర్తిచేశారు. వీరికాలంలో దేవాలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఏకశిలను తొలిచి నిర్మించిన రాక్ఫోర్ట్ పర్వత శిఖరానికి... ఎంతో కఠినతరమైన 437 ఎగుడు మెట్లు ఎక్కితే గాని చేరుకోలేం.
మూడు దేవాలయాల సమాగయంగా ఉన్న రాక్ఫోర్ట్ తమిళనాడులో తిరుచ్చి (తిరుచిరాపల్లి)లో ఉన్నది.
ప్రతిరోజు ఇక్కడ ఆరు రకాల పూజలు జరుగుతాయి. చితిరైలో ప్రతియేటా ఒకసారి బ్రహ్మోత్సవం కూడా జరుగుతుది. ఆదిపూరం, ‘ఫ్లోట్ ఫెస్టివల్’ జరిగే ‘పంగుని’ ప్రదేశం కూడా ఇక్కడ ఎంతో ప్రఖ్యాతిపొందిన ప్రదేశం. మధురై నాయకులు నిర్మించిన ఈ రెండు దేవాలయాల్లో ఒకటి శివాలయం కాగా, మరొకటి గణేష్ దేవస్థానం. అద్భుత శిల్పకళారీతులకు ఆలవాలంగా ఉన్న... 7వ శతాబ్దానికి చెందిన దేవాలయాలు ఇవి. ప్రఖ్యాతిగాంచిన ఎన్నో శిల్పరీతులకు పెట్టింది పేరు. పర్వత పాదాల వద్ద ఉన్న వినాయకుడి దేవస్థానం, అలాగే పర్వత శిఖరం వద్ద ఉన్న అతిపెద్ద శ్రీ తాయుమాన స్వామి దేవాలయాల్లోకి హిందూయేతరులను అనుమతించరు. పర్యాటకుల సందర్శనార్థం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయాలను తెరిచి ఉంచుతారు.
వినాయక దేవస్థానం... పౌరాణిక గాధ...
తాయుమనస్వామి చరిత్ర...
వినాయుడి దేవస్థానానికి ఉన్నట్టే, ఈ గుడికి కూడా పురాతన గాధ ప్రచారంలో ఉంది. ఒకనాడు శివభక్తురాలైన రత్నవతి అనే ఆవిడ పురిటినొప్పులతో బాధపడుతూ తన తల్లి రాకకోసం ఎదురుచూస్తుంది. ఎంతసేపటికీ తన తల్లి రాకపోవడంతో... ‘నన్ను ఎలాగైనా రక్షించు స్వామీ’ అని శివుడిని వేడుకుంటుంది. అప్పుడు శివుడే స్వయంగా రత్నవతి తల్లి రూపంలో వచ్చి పురుడు పోస్తాడు. అప్పటినుండి ఆయనకు ‘తాయుమనస్వామి’ అనే పేరు స్థిరపడిపోయింది (తాయుం - అన - స్వామి అంటే... తల్లి రూపంలో వచ్చిన భగవంతుడు అని అర్థం). అప్పటినుండి ఈ దేవాలయానికి తాయుమనస్వామి దేవాలయం అనే పేరు సార్థకమైంది. పర్వతపాద ప్రాంతం నుండి సుమారు రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. దేవాయం పైకప్పుపై ఉన్న పెయింటింగ్స్ సందర్శకులను మైమరపిస్తాయి. ఈ ఆలయ నిర్మాణం ఆనాటి పల్లవుల శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడతాయి. ఇక్కడ శివపార్వతులతో పాటు మహాలక్ష్మి విగ్రహం కూడా ఉండడం విశేషం. ఇక్కడ ఉన్న శివాలయంలో శివుడు అతిపెద్ద లింగాకారంలో ఉంటాడు. అలాగే... పార్వతి దేవి కి ప్రత్యేక గర్భగుడి ఉంది.చేరుకునేదిలా...
విమాన మార్గం:
రాక్ఫోర్ట్ టెంపుల్ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో తిరుచ్చి ఎయిర్పోర్టు ఉంది. చెనై్న మీదుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలు విమాన సౌకర్యం ఉంది.రైలు మార్గం:
రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు తిరుచ్చి రైల్వేస్టేషన్ చేరుకుని అక్కడినుండి రోడ్డు మార్గం ద్వారా రాక్ఫోర్ట్ టెంపుల్ చేరుకోవచ్చు. దక్షిణ రైల్వే పరిధిలో అతిపెద్ద జంక్షన్ తిరుచ్చి. ఇక్కడి నుండి చెనై్న, తంజావూర్, మధురై, తిరుపతి, ట్యుటికోరిన్, రామేశ్వరం తదితర ప్రాంతాలకు మీటర్ గేజీ లైను ఉంది. అలాగే బెంగుళూరు, కోయంబత్తూర్, మైసూర్, కొచ్చి, కన్యాకుమారి, మంగళూరు లను కలుపుతూ బ్రాడ్గేజ్ లైన్ ఉంది. ప్రతిరోజు పదుల సంఖ్యలో ఈ జంక్షన్ నుండి వివిధ రైళ్ళు అందుబాటులో ఉంటాయి.
రోడ్డుమార్గం:
దాదాపు దక్షిణ భారత దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడి రోడ్డు మార్గం ఉంది. ప్రతిరోజూ ఆ నగరాలనుండి ఇక్కడి బస్సులు నడుస్తాయి. ఇక లోకల్గా తిరగడానికి సిటీ బస్సులు, టూరిస్ట్ ట్యాక్సీ, ఆటో రిక్షా, సైకిల్ రిక్షా వంటివి అందుబాటులో ఉంటాయి.