Telugu Funny Jokes - 8

వారులేని ఈ బతుకేల?!

"మా వారు తప్పిపోయారని వారం రోజుల క్రితం రిపోర్టు ఇచ్చాను. ఇంత వరకు వారి అచూకీ కనుక్కోలేకపోయారు. ఆయన లేకుండా నేను బతకలేనండీ ... '' రెండు చేతులతో మొఖం కప్పుకుని ఏడ్చింది కోమలి.
"క్షమించమ్మా! మీవారి మీద మీకున్న ప్రేమను అర్థం చేసుకోగలను. ఐనా మా ప్రయత్నం మేం చేస్తూనే ఉన్నాం ...'' జాలిగా అన్నాడు పోలీస్ అధికారి.
"ఆయన వెళ్లినదగ్గర్నుండి ఎక్కడి పనులక్కడే ఆగిపోయాయంటే నమ్ముతారా? ఇల్లంతా మాసిన బట్టలే ... సింకునిండా అంట్లే ... ఏ మూల చూసినా బూజే ... హాటల్ తిండి తినలేక నిజంగానే చచ్చిపోతున్నాను ఎస్.ఐ. గారూ ...'' ఏడుపు ఆపి, కొంగుతో కళ్లొత్తుకుంటూ చెప్పింది కోమలి.

ఏడాదిలో రాత్రులెన్ని?

"సంవత్సరానికి 365 రోజులైతే ... అందులో రాత్రులెన్ని?'' అడిగింది టీచర్.
"పది టీచర్?'' చెప్పాడు టింకూ.
"అదెలా?'' ఆశ్చర్యపోయింది టీచర్.
"ఒక శివరాత్రి, తొమ్మిది నవరాత్రులు... మొత్తం పది'' వివిరించాడు టింకూ వేళ్లు లెక్కబెడుతూ.

ఆర్డర్ - ఆర్డర్

ఒక కేసు విచారణ నిమిత్తం నిషాలో ఉన్న మంగరాజుని కోర్టుకి తీసుకొచ్చి బోనులో నిలబెట్టారు పోలీసులు.
కోర్టు హాల్లో అందరూ మాట్లాడుకోవడం గమనించిన జడ్జి "ఆర్డర్ - ఆర్డర్'' అంటూ గట్టిగా కేకేశాడు.
వెంటనే "ఒక చిల్లీ చికెన్, క్వార్టర్ రాయల్ స్టాక్ విస్కీ తీసుకురా'' జడ్జీకంటే గట్టిగా అరిచి, జనాల్ని చూసి నాలుక కరుచుకున్నాడు గంగరాజు.

యథా గురూ ...

"గోల్డ్ చెయిన్ కరిగిస్తే ఏమొస్తుంది పిల్లలూ?''
"గోల్డు సార్ ... ''
"వెండి చెయిన్ కరిగిస్తే?''
"వెండి సార్ ...''
"సైకిల్ చెయిన్ కరిగిస్తే?''
"సైకిల్ సార్ ...''
" !!!!! .... ???''

'ఉత్త'ర కుమారుడు

"ఐదు సంవత్సరాలనుండి కమలకి ప్రేమలేఖల్ని రాస్తున్నాను తెలుసా?'' విచారంగా అన్నాడు ప్రేమారావు.
"అయితే ఓకె అంటుంది - బాధ పడకు'' ధైర్యం చెప్పాడు మిత్రుడు గోపాల్రావు.
"ఓకె అంది కాని నాతో కాదు, ఈ ఐదేళ్లూ నా ఉత్తరాల్ని అందించిన పోస్టుమాన్‌తో'' అసలు సంగతి చెప్పాడు ప్రేమారావు.
కొళాయి నీళ్లు వాడుతున్నాం!

"మీవారు ఇంటి వెనకున్న బావిలో పడి,పోయారట కదా? పాపం - బాధని ఎలా భరిస్తున్నారో?'' అంది చుట్టంచూపుగా వచ్చిన ఆదిలక్ష్మి.
"భరించక తప్పుతుందా వదినా ? ఎంచక్కా నూతి నీరు వాడుకునేవాళ్లం. ఇప్పుడు కొళాయి నీటి కోసం రెండు మైళ్లు నడవాల్సి వస్తోంది - ఖర్మ'' ఉస్సురంటూ చెప్పింది సుబ్బలక్ష్మి.  

కోపం వచ్చింది...
వెంగళప్ప భార్య వెంగళప్పకు రెండు పది రూపాయల నోట్లిచ్చి పది రూపాయలకు వంకాయలు, పది రూపాయలకు దోసకాయలు తెమ్మని బజారుకు పంపింది. వెంగళప్ప హుషారుగా సంచితో బయలుదేరి, కొద్దిసేపటికే వెనక్కి వచ్చేశాడు.
అతడి చేతిలో ఖాళీ సంచి తప్ప కూరగాయలు లేవు. వెంగళప్ప భార్య పట్టలేని కోపంతో ‘‘కూరలేవీ?’’ అని అడిగింది.
‘‘నువ్యు ఏ పదితో వంకాయలు ఏ పదితో దోసకాయలు తెమ్మన్నావో చెప్పలేదు కదా. నన్నంటావేం?’’ అన్నాడు వెంగళప్ప కోప్పడుతూ. 

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top