బియ్యం - ఒక కప్పు
పెసరపప్పు - అర కప్పు
టొమాటోలు-5
గరంమసాలా ఒక స్పూను
మిరియాలు - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను
పసుపు - అర టీ స్పూను
ధనియాలపొడి - టీ స్పూను
లవంగాలు - 10
పలావ్ ఆకులు - 2
ఉప్పు - తగినంత
ఉల్లితరుగు - కప్పు
తయారి:
ముందుగా బియ్యం, పెసరపప్పులను శుభ్రంగా కడిగి అరగంట సేపు నానిన తరవాత నీరు వంపేసి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో టీ స్పూను నూనె కాగాక మిరియాలు, జీలకర్ర, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. టొమాటో ముక్కలు కూడా వేసి మెత్తగా ఉడకనీయాలి. తరవాత బియ్యం, పప్పు దీనిలో కొద్దిసేపు వేగనిచ్చిన తరువాత తగినన్ని నీళ్లు పోసి బాగా ఉడకనీయాలి. చివరగా గరంమసాలా వేసి కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే మసాలా కిచిడీ రెడీ...