మోడరన్ పిజ్జా


కావలసిన పదార్దాలు :
మినప్పప్పు - కప్పు
బియ్యం - రెండు కప్పులు
ఉప్పు - తగినంత
టాపింగ్ కోసం
క్యాప్సికమ్ తరుగు - రెండు టీ స్పూన్లు
క్యారట్ తురుము - రెండు టీ స్పూన్లు
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను
తరిగిన కొత్తిమీర - టీస్పూను
టొమాటో - రెండు (చక్రాలుగా తరగాలి)
కీరా - చిన్నది ఒకటి (చక్రాలుగా తరగాలి)

తయారి:
మినప్పప్పును ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరబోయాలి. తరవాత మిక్సీలో వేసి రవ్వలా చేసుకోవాలి. మరుసటి రోజు మినప్పప్పును మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో బియ్యపురవ్వను కలిపి ఒకగంట సేపు నాననివ్వాలి. తరవాత బాణలిలో కొద్దిగా నూనె వేసి పిండి మిశ్రమాన్ని అంగుళం మందంలో వేసి చుట్టూ నూనె వేసి మూత పెట్టి సన్నటి సెగ మీద కాలనివ్వాలి. బాగా కాలిన తరవాత ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. వేడిగా ఉండగానే దాని మీద కూరగాయల తరుగును అందంగా అలంకరించి పిల్లలకి అందిస్తే మజామజాగా మోడరన్ పిజ్జా తింటారు. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది.



block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top