మునగకాయలు - నాలుగు
టమాటలు - నాలుగు
పన్నీర్ - ఒక కప్పు
ఉల్లిపాయలు - రెండు
వేరుశెనగలు - అర కప్పు
ఉడికించిన బఠాణీలు - పావు కప్పు
పసుపు - చిటికెడు
పుట్నాలు - అర కప్పు
ధనియాలు - ఒకటిన్నర స్పూన్
ఎండు మిరపకాయలు - ఏడు
ఎండు కొబ్బరి - పావు కప్పు
వెల్లుల్లి - ఆరురెబ్బలు
పాలు -ఒక గ్లాసు
ఉప్పు, కొత్తిమీర
పొపు సామగ్రి - తగినంత.
తయారుచేయు విధానం
ముందుగా ఒక పాత్రలో కొద్దిగా నూనె వేసి కాస్త వేడి అయ్యాక వేరుశెనగలు, పుట్నాలు, ధనియాలు, ఎండు మిరపకాయలు, ఎండు కొబ్బరి వేసి దోరగా వేయించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత వెల్లుల్లి వేసి పొడి చేసి పెట్టుకోవాలి. పన్నీర్ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక పాత్రలో కొద్దిగా నూనె వేసి కాస్త వేడి అయ్యాక పోపు సామగ్రి వేసుకోవాలి. తరువాత ఉల్లిపాయలు వేసి కాస్త ఫ్రై అయ్యాక మునగకాయ ముక్కలు వేయాలి.
ఈలోగా టమాటలను మరుగుతున్న నీటిలో వేసి తీసుకోవాలి. తరువాత వాటిని మిక్సీలో వేసి గుజ్జుగా చేసుకోవాలి. దీన్ని ఉడుకుతున్న మునగకాయ మిశ్రమంలో వేసి ఉడికించిన బఠాణీలు, పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి మరి కాసేపు ఉడికించాలి. ఇందులో ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి మిశ్రమాన్ని వేసి కాసిన్ని నీళ్లుపోసి మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసి మరి కొద్ది సేపు ఉడికించుకోవాలి. చివరగా గ్లాసు పాలు పోసి బాగా కలియబెట్టి కొత్తిమీర వేసి దింపుకోవాలి. అంతే.. మునగకాయ పన్నీర్ కర్రీ రెడీ.