ఎవరు తీసుకోవాలి...
గర్భనిరోధక మాత్రలను 18 నుంచి 40 సంవత్సరాలున్న మహిళలందరూ తీసుకోవచ్చు. వీటిని మూడు నుంచి ఐదు సంవత్సరాలు వాడడం మంచిది. అంతకుమించి వాడాలనుకుంటే డాక్టర్ల సలహాను తీసుకోవాలి. గర్భనిరోధక మాత్రలను ఉపయోగించే ముందు డాక్టర్లను తప్పనిసరిగా సంప్రదించాలి. వారు సూచించిన మేరకు తమకు అనువైన మాత్రలను వేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం.
వివిధ రకాలుగా...
నేడు గర్భనిరోధక మాత్రలు సాధారణంగా రెండు రకాలు లభిస్తున్నాయి. వీటిలో 21 టాబ్లెట్లతో కూడిన స్ట్రిప్ ఒకటైతే రెండవది 28 టాబ్లెట్లతో కూడిన స్ట్రిప్ మరొకటి. 21 టాబ్లెట్లతో కూడిన స్ట్రిప్ ను మెన్సెస్ వచ్చిన ఐదవ రోజు నుంచి 25 వ రోజు వరకు వేసుకోవాలి. ప్రతి రోజు రా త్రి పడుకునే ముందు ఈ మాత్రలను తీసు కోవాలి. ఏదైనా రాత్రి మరచిపోతే మరుస టి ఉదయం వేసుకొని రాత్రి ఎప్పటిలాగే మ ళ్లీ మరొక మాత్ర వేసుకోవాలి. 21 టాబ్లెట్లు పూర్తయిన తర్వాత 2,3 రోజుల్లో మెన్సెస్ వస్తాయి ఆ తర్వాత అయిదు రోజుల గ్యాప్ తో మళ్లీ ఈ మాత్రలను తీసుకోవాలి. 28 టాబ్లెట్ల స్ట్రిప్ను ఉపయోగిస్తే ప్రతిరోజు ఒక మాత్రను వేసుకోవాలి. గర్భనిరోధక మాత్ర లను డాక్టర్చేత చెకప్ చేయించుకొని వేసు కోవాలి. వీటిని వేసుకోవడం ప్రారంభించే ముందు బరువు, బిపి చెక్ చేస్తారు. యుటి రస్ పరీక్ష కూడా నిర్వహిస్తారు. ఇటీవల కొత్తగా గర్భనిరోధక మాత్రలు వచ్చాయి. వీటిని వారానికి రెండు సార్లు మూడు నెలల పాటు వాడిన అనంతరం వారానికి ఒకటి వాడితే సరిపోతుంది. ఇవి గర్భనిరోధానికి ఎమర్జెన్సీ పిల్గా కూడా పనిచేస్తాయి.
కాన్పు తర్వాత...
శిశువుకు పాలిస్తున్న తల్లి ఆరు నెలల తర్వాత గర్భనిరోధక మాత్రలను వాడడం శ్రేయస్కరం. పాలివ్వని తల్లి మూడు నెలల తర్వాత వీటిని వాడవచ్చు. ఈ మాత్ర లతో తల్లిలో పాలు తగ్గే అవకాశం ఉంది.గర్భనిరోధ మాత్రలను వాడుతున్న ప్పుడు మధ్యమధ్యలో డాక్టర్ చేత చెకప్ చేయించుకోవాలి. డాక్టర్ బ్రెస్ట్ ఎగ్జామి నేషన్, యుటిరస్ టెస్ట్, కొలెస్ట్రాల్ లెవెల్స్ పరీక్ష నిర్వహిస్తారు. ప్రస్తుతం గర్భ నిరోధక మాత్రలను ప్రభుత్వం రూరల్ హెల్త్ కేర్ సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ ఆసుపత్రు ద్వారా ఉచితంగా సరఫరాచేస్తోంది.
ఉపయోగాలు...
గర్భనిరోధక మాత్రల వల్ల ఇష్టంలేనప్పుడు గర్భం ధరించకుండా ఉండవచ్చు. ఫ్యా మిలీ ప్లానింగ్కు ఎంతో దోహదపడతాయి ఈ మాత్రలు. ప్రెగ్నెన్నీ ప్లానింగ్తో తల్లి, పుట్టే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటారు.గర్భనిరోధక మాత్రల సక్సెస్ రేట్ ఎంతో ఎక్కువ. ఫెయిల్యూర్ రేట్ కేవలం 0.4 శాతమే. కొంతమంది స్త్రీలలో పీరి యడ్స్లో బ్లీడింగ్ వస్తుంటుంది. గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల ఈ బ్లీ డింగ్ తగ్గుతుంది. బహిష్టు సమయంలో కొందరు కడుపునొప్పితో బాధపడుతుం టారు. అటువంటి వారికి ఈ మాత్రలు ఉపశమనంగా ఉంటాయి. ఈ మాత్రల వి నియోగంతో గర్భాశయం ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.హెక్టోపిక్ ప్రెగ్నెన్సీ రాకుండా ఉం టుంది. రుమాయిటెడ్, ఆర్థరైటిస్ ఉన్న వాళ్లకి ఈ టాబ్లెట్లు ఉపశమనంగా ఉంటా యి. ఓవరీస్లో సిస్ట్లు ఉండే వారికి ఈ మాత్రలు ట్రీట్మెంట్గా పనిచేస్తాయి. బ్లీడింగ్ ఎక్కువ ఉన్నవారికి ఈ మాత్రల వాడకంతో చాలా వరకు తగ్గుతుంది.
ఎవరు వాడకూడదు...
గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు గర్భనిరోధక మాత్రలను వాడకూడదు. బి పి ఎక్కువగా ఉన్నవాళ్లు, షుగర్ వ్యాధి ఉన్నవాళ్లు వీటిని వేసుకోకూడదు. కాలే యం సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నవాళ్లు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టి ఉన్నవాళ్లు ఈ మాత్రలను ఉపయోగించకూడదు. 40 సంవ త్సరాలు పైబడిన వాళ్లు, స్మోక్ చేసేవాళ్లు కూడా వీటిని వాడకూడదు.
సైడ్ ఎఫెక్ట్స్...
గర్భనిరోధక మాత్రలను వాడడం వల్ల కొందరు మహిళల్లో కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది. వాంతి వచ్చినట్టు, గ్యాస్ ప్రాబ్లమ్తో వారు ఇబ్బం ది పడుతుంటారు. పొట్ట ఉబ్బి నట్టు కూడా వారికి అనిపి స్తుంది. కొందరికి నెలమధ్యలో బ్లీడింగ్ అవుతుంది. కొందరికి వెజెనల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. లివర్ సమస్య కూడా రావచ్చు. టిబి ఉన్న వారు వీటిని వేసు కుంటే ఇబ్బందులు ఎదురవు తాయి. కొంత మందికి తలనొ ప్పి రావచ్చు. బరువు పెరుగుతా రు. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టు కుపోతుంది. ఇటువంటి సమ స్యలు ఎదురై నప్పుడే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.