అన్నపూర్ణ స్టూడియోస్, జీ తెలుగు సంయుక్తంగా అందిస్తున్న మెగా డైలీ సీరియల్ ‘పసుపు కుంకుమ’ నేటి నుంచి జీ-తెలుగులో ప్రసార మౌతుంది. ఈ సంద ర్భంగా నిర్మాత అక్కి నేని నాగార్జున మాట్లా డుతూ ‘స్ర్తీ ఉన్నతిని, సంస్కృతి, సాంప్రదా యాలను ప్రతిబింబిం చే ధారావాహిక ఇది. పసుపు, కుంకుమలు జీవితాన్ని ప్రతిఫలిస్తా యి. అదే టైటిల్తో ఓ స్ర్తీ జీవితంలో మలు పులు, సంఘటనలు చూపిస్తూ రూపొం దించిన ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తుంది’ అన్నారు. జీ తెలుగు బిజినెస్ హెడ్ జి.అనూరాధ మాట్లాడుతూ ‘అమ్మ, నాన్న, తమ్ముడు..ఇదే తనలోకం అని భావించే ఓ సావిత్రి కథ ఇది. మహిళలు మెచ్చే అంశాలు పుష్కలంగా ఉంటాయి. చిన్నకోడలు-తరహా వైవిధ్యమైన సీరియల్ ఇది. టైటిల్ సాంగ్ ప్రత్యేకంగా అలరిస్తుంది. సాయంత్రం ప్రైమ్ టైమ్లో వచ్చే ఈ సీరియల్కి విజయభాస్కర రెడ్డి దర్శకుడు’ అన్నారు.