కావలసిన పదార్దాలు :
మైసూరు పప్పు 2 కప్పులుక్యారెట్ 4
టొమాటోలు 8
ఉల్లిపాయలు 8
అల్లం 1అంగుళం ముక్క
వెల్లుల్లి 12 రేకలు
పెరుగు 1/4 కప్పు
గరం మసాలా 2 చెంచాలు
ధనియాల పొడి 4 చెంచాలు
ఉప్పు, పసుపు సరిపడా
పొదినా 1 కట్టలు
నూనె వేపటానికి సరిపడా
నెయ్యి 4 చెంచాలు
తయారి విదానం :
పప్పు ను నీటిలో నాననిచ్చి నానిన తర్వాత నీళ్లు వడకట్టి బరకగా గట్టిగా రుబ్బుకోవాలి. దీనికి తురిమిన క్యారట్, సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి ముక్కలు, పొదినా సన్నగా కట్ చేసి వేసుకుని తగినంత ఉప్పు వేసి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేపి ఉంచాలి.మిగిలిన ఉల్లి, టొమాటో ముక్కలు, వెల్లుల్లి, అల్లం, పసుపు, కారం, ధనియాల పొడి అన్నింటిని కలిపి రుబ్బి ఉంచాలి. బాండిలో నెయ్యి వేసి కాగిన తర్వాత రుబ్బిన మసాలా వేసి నెయ్యి పైకి తేలే వరకు వేయించాలి. కొంచెం నీళ్లు పోసి ౧౦ నిమిషాలు ఉడికించి చిక్కబడిన తర్వాత వేయించుకున్న కోఫ్తా ఉండలు, పొదినా ఆకులు వేసి గరం మసాలా వేసి కలిపి దించి వేడిగా వడ్డించాలి.