కావలసిన పదార్దాలు :
మైదా పిండి - 100 గ్రాములుబంగాళ దుంపలు- 100 గ్రాములు
వెన్న (బటర్)- 1 టేబుల్ స్పూన్
బేకింగ్ పౌడర్- అర టీస్పూన్
ఉప్పు - సరిపడినంత
పిజ్జా సాస్ కోసం...
టమాటో పూరీ- 4 టేబుల్ స్పూన్లు
గరం మసాలా- అర టీస్పూను
ఉప్పు - ఒక టీ స్పూను
అజె్వైన్ - పావు టీస్పూన్
ధనియాల పొడి- అర స్పూన్
కారం - ఒక టీస్పూన్
టాపింగ్ కోసం...
చీజ్ - 50 గ్రాములు
కాప్సికమ్ ముక్కలు - చిన్న కప్పు
ఉల్లిపాయ - ఒకటి
తయారు చేసే విధానం...
బంగాళ దుంపలను ఉడకబెట్టాలి. తరువతా ముద్దగా చేసుకోవాలి. మైదా పిండిలో బట్టర్ వేసి ముద్దగా కలపాలి. దీనికి దుంప, బేకింగ్ పౌడర్, ఉప్పు కలపాలి. కొద్దిగా చల్లని నీళ్ళు పోస్తూ ఈ ముద్ద మొత్తం బాగా కలపాలి. సాస్ తయారు కోసం సిద్ధంగా వుంచుకున్న దినుసులన్నిటినీ, టొమాటో పూరీతో బాగా కలిపి, దీనిని పక్కన వుంచుకోవాలి. పిజ్జా కోసం వుంచిన ముద్దని ఒక పొరలాగా చేసి ప్లేట్లో పోయాలి.సాస్ను పిజ్జామీద పోసి, ఓవెన్లో వుంచి ఆరు నిముషాలు వేడి చేయాలి. బయటకు తీసి దానిమీద చీజ్ పోసి ఒక్క నిముషం ఓవెన్లో వేడి చేయాలి. బయటకు తీసి చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేయాలి.