బొబ్బట్లు
కావలసిన పదార్థాలు:
శనగపప్పు - ఒక కప్పుబెల్లం - కప్పున్నర
మైదాపిండి - పావుకిలో
నూనె - సరిపడా
ఉప్పు - తగినంత
యాలకుల పొడి - ఒక టీ స్పూను
నెయ్యి - సరిపడా.
తయారుచేయు విధానం:
రెండు గంటలపాటు శనగపప్పుని నానబెట్టాలి. తరువాత కుక్కర్లో పెట్టి ఉడకపెట్టాలి. బాగా మెత్తగా ఉడికిన పప్పులో, సన్నగాతరిగిన బెల్లం వేసి సన్ననిసెగపై ఉడికించాలి. అడుగు అంటకుండా గరిటతో కలుపుతూ ఉండాలి.చిక్కబడిన తర్వాత యాలకుల పొడి వేసి దించేయాలి. దీన్ని పూర్ణం అంటారు. ఈ పూర్ణం చల్లారిన తర్వాత మళ్లీ మెత్తగా రుబ్బాలి. దాన్ని చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
మైదాపిండిలో కొద్దిగా వేడినీళ్లు, నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చేతిలో వేసుకుంటే జారిపోయేలా ఉండాలి. కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని కొంచెం వెడల్పుగా చేయాలి. దాని మధ్యలో పూర్ణం ఉండను పెట్టి- చుట్టూ పిండితో మూసేసి- అరటాకుపై వేసి పలచుగా ఒత్తుకోవాలి.
పెనం పెట్టి నెయ్యి వేసి వేడిచెయ్యాలి. ఈ అట్టుని సన్నని మంటపై వేయించాలి.