అనితర సాధ్యమనదగ్గ నాట్యంతో ఓ దశాబ్ధంపాటు బాలీవుడ్ను పరిపాలించిన నాట్య సంచలన మాధురి దీక్షిత్.. ఓ డాన్స్ బేసెడ్ రియాల్టీ షోకు జడ్జ్గా వ్యవహరించేందుకు తన సమ్మతి తెలిపింది. సోనీ టీవీలో ‘ఝలక్ దిఖలాజా’ పేరుతో నిర్వహించబడే ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ దీపికా పదుకునే చేసే డాన్స్ను మాధురి జడ్జ్ చేయనున్నారు. ‘డాన్స్ విత్ ది లీడర్’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన డాన్స్ షోకు ఇండియన్ వెర్షన్గా ఈ కార్యక్రమం రూపొందించడుతోంది. ‘ఏక్ దో తీన్.. చార్ పాంచ్ ఛే సాత్ ఆఠ్ నౌ.. దస్ గ్యారహ్’ అంటూ కోట్లాది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన మాధురి న్యాయ నిర్ణేతగా వ్యవహరించనుండడం ఈ కార్యక్రమానికి క్రేజ్ తెచ్చిపెట్టనుంది.