దంతాలు, ఎముకలు పటిష్టంగా ఉండాలంటే శరీరంలో తగిన కాల్షియం ఉం డాలి. మనలో కాల్షియం తగ్గేకొద్దీ ఎముకలు బలహీనపడతాయి. పురుషులతో పోల్చినప్పుడు స్ర్తీలకే అధిక కాల్షియం అవసరం అంటున్నారు నిపుణులు. మహి ళల్లో వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎముకలు పెళుసుగా మారతాయి. దీనికి కారణం కాల్షియం కొరవడటమే. వయస్సు పెరుగుతున్నా ఎముకలు పటిష్టంగా ఉండాలంటే పాలను, పండ్లను అధికంగా తీసుకోవాలి. సి విటమిన్, కాల్షియం సప్లిమెంట్లను తీసుకుంటే శరీరానికి కాల్షియం పుష్కలంగా అందుతుంది.
గోధుమలు, పాలిష్ చేయని బియ్యం, పీచుపదార్థాలు తింటే పూర్తిస్థాయిలో కాల్షియం అందు తుంది.కాల్షియం సప్లిమెంట్లను వేడి పదార్థాలతో కలిపి తీసుకోకూడదు. నిద్రపోయే ముందు, తరువాత గానీ వీటిని తీసుకోవాలి. మీ శరీరతత్వానికి తగ్గుట్టుగా ఎంత ఎంజి ఉన్న మాత్రలు వేసుకోవాలో డాక్టరును ఖచ్చితంగా సంప్రదించాలి. ఏవైనా అతిగా తీసుకుంటే ప్రమాదమే కాబట్టి వీటిని కూడా తగిన మోతాదులోనే తీసుకోవాలి. ఒకరోజు తీసుకున్న పాలు, పెరుగు సుమారు 300 ఎంజి కాల్షియాన్ని అందించగలవు. నిమ్మజాతి పండ్లను తీసుకున్నా శరీరానికి సరిపడా కాల్షియం అందుతుంది.