కావలసిన పదార్థాలు :
శనగపిండి(మెత్తనిది)-ఒక కేజిపంచదార -రెండు కేజీలు,
ఎండు ఖర్జూరం-200గ్రా
పాలు-రెండు లీటర్లు
యాలకులు-50గ్రా
నెయ్యి-నాలుగు కేజీలు
జీడిపప్పు-350గ్రా
బాదంపప్పు-200గ్రా
కిస్మిస్-150గ్రా
పటికబెల్లం-200గ్రా
పచ్చకర్పూరం-7గ్రా
తయారుచేసే విధానం :
ఎండు ఖర్జూరాన్ని వేడి నీటిలో వేసి గంటసేపు నానబెట్టాలి. పాలు మరిగించి దించి చల్లార్చాలి. ఒక కళాయిలో పంచదార వేసి, నీళ్లు పోసి స్టవ్పై ఉంచి పంచదార కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. మరీ లేతగా, మరీ ముదురుగా కాకుండా సమపాకం పట్టుకోవాలి.
కళాయిని కిందికి దింపి, యాలకుల పొడి వేసి కలపాలి. ఒక గరిటెలో బాగా కాచిన నెయ్యి తీసుకుని అందులో పచ్చ కర్పూరం వేసి అది కరిగిన వెంటనే ఆ నెయ్యిని పంచదార పాకంలో పోయాలి. చల్లారిన పాలలో శనగపిండి వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. మరో కళాయి స్టవ్పై ఉంచి అందులో నెయ్యి వేసి అది మరిగిన తరువాత బూందీ దూసే చిల్లుల గరిటెలో శనగపిండి వేసి చేతితో కలుపుతూ బూందీ వేసుకోవాలి.
ఈ బూందీని పక్కన ఉంచుకున్న పాకంలో వేసి బాగా కలపాలి. తరువాత వేడినీటిలో నానబెట్టిన ఎండు ఖర్జూరాన్ని తీసి నేతిలో వేయించి బూందీలో వేసి కలపాలి. జీడిపప్పు, కిస్మిస్, బాదంపప్పు, పిస్తాపప్పు వీటన్నింటినీ నేతిలో వేయించుకుని బూందీలో వేసి కలపాలి.
ఈ మిశ్రమాన్ని ఒక గంటసేపు అలాగే ఉంచి, తరువాత పటికబెల్లాన్ని ముక్కలుగా చేసి బూందీ మిశ్రమంలో వేసి బాగా కలిపి అర చేతికి నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్నికొద్దికొద్దిగా తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి.