పాలకూరతో మతిమరపు మాయం......


మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఆకుకూరలను తప్పనిసరిగా చేర్చాలి.మిగిలిన కూరగాయలతో పోల్చితే ఆకుకూరల్లో అన్ని రకాల పోషకపదార్థాలూ ఉంటాయి. ముఖ్యంగా పాలకూర. పోషకాహార నిధి అయిన పాలకూరలో లభించే ప్లేవనాయిడ్స్‌ వయసుతోపాటు వచ్చే మతిమరుపును దూరం చేస్తుందట.
పాలకూరలో పదమూడు రకాల యాంటీ ఆక్సిడెంట్‌లు ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్‌ ఏజెంట్లుగా పని చేస్తాయి.పాలకూరలో లభించే విటమిన్‌ సి, ఏ లు, మెగ్నీషియం, ఫోలిక్‌యాసిడ్లు క్యాన్స ర్‌ను నివారిం చడంలో తోడ్పడుతాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెస్ట్‌క్యాన్సర్‌ ను అదుపు చేయడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. ఈ కూరలో ఇంకా కాల్షియం, సోడియం, క్లోరిన్‌, ఫాస్పరస్‌, ఇనుము, ఖని జ లవణాలు, ప్రొటిన్లు, విటమి న్‌ ఏ, విటమిన్‌ సీ తదితరాలు ఉంటాయి.

పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువని ఇటీవలి పరిశోధనల్లో సైతం వెల్లడైంది. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధకశక్తిని కూడా పెంచుతుంది.జ్వరం, పిత్త, వాయు, శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. పాలకూరకు రక్తాన్ని శుద్ధి చేసే తత్వం కూడా అధికంగా ఉంది. స్ర్తీల సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది. పాలకూరను వెజిటబుల్‌ సూప్‌లోనూ, చపాతీలు చేసుకునే పిండిలోనూ, పకోడీల పిండిలోనూ, పన్నీర్‌తో కలిపి వండే కూరల్లోనూ అనేక రకాలుగా వాడుకోవచ్చు.

ఇతర ఆకుకూరల్లాగా పాలకూరను వేపుడు చేసుకుని తిన వచ్చు. ఎలాగైనా సరే ప్రతిరోజు తినే ఆహార పదార్ధాలలో పాలకూరను భాగం చేసు కుంటే ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందని పోష కాహార నిపుణులు అంటున్నారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top