బరువు తగ్గడానికి పంచౌషధాలు
భారతీయ వంటల్లో సుగంధ ద్రవ్యాలకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఇతర దే శాలతో పోలిస్తే మనదగ్గర స్థూలకాయం సమస్య చాలా తక్కువ. అందుకు ఈ సుగంధ ద్రవ్యాలే కారణమని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. స్థూలకాయంతో బాధపడేవారు ఆహారంలో వీటిని కూడా చేర్చుకోవడం వల్ల ప్రయోజనం పొందవచ్చు.
దాల్చినచెక్క
దీనికి రక్తంలో గ్లూకోజ్ని తగ్గించే గుణం ఉంది. చెడు కొలెస్టరాల్ను 27శాతం వరకూ తగ్గించే శక్తి దీని సొంతం. టైప్ 2 మధుమేహ రోగులకు ఇది మంచి ప్రయోజనకారి. రక్తం గడ్డకుండా నిరోధిస్తుంది. దీన్ని మోతాదుకు మించి తీసుకోకూడదు. అలా తీసుకుంటే దీనిలో ఉండే కొమారిన్ అనే రసాయనం లివర్కి హాని చేస్తుంది.
మిరపకాయ
ఆ వేడికి శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుందని పరిశోధనల్లో స్పష్టమైంది. ఆకలి పుట్టించే గుణం కూడా దీనికుంది. ఈ రసాయనం శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా చూడడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
నల్ల మిరియాలు
జీర్ణశక్తిని వృద్ధి చేయడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. తీసుకున్న ఆహారం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకూ పోషకాలందేలా చూస్తాయి. దీనిలో ఉండే పిపరిన్ రసాయనం దేహంలోని జీవక్రియలను ఉత్తేజపరుస్తుంది. శరీర బరువు సమతుల్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. తాజా మిరియాల్లో ఔషధ గుణాలెక్కువగా ఉంటాయి.
ఆవాలు
రోజుకొక చెంచాడు ఆవపిండిని తీసుకుంటే 25 శాతం మేరకు జీవక్రియలు ఉత్తేజితమవుతాయని ఇంగ్లండ్లోని ఆక్స్ఫర్డ్ పాలిటెక్నిక్ శాస్త్రవేత్తల అధ్యయనంలో తాజాగా వెల్లడైంది. అధిక రక్తపోటు తగ్గించడానికి ఆవనూనె చక్కగా పనిచేస్తుంది. వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్, మాంగనీస్, జింక్, ప్రొటీన్, కాల్షియం, నయసిన్ సమృద్ధిగా లభిస్తాయి.
అల్లం
అంతేకాదు తీసుకున్న ఆహారంలో చెడును వెంటనే బయటకు నెట్టేస్తుంది. దాంతో బరువు పెరగకుండా ఉండడం సాధ్యమవుతుంది. వొవేరియన్ క్యాన్సర్ కణాలను నిర్వీర్యం చేసే అల్లానికి ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
జలుబు, మైగ్రేన్, ఉదయం పూట మగతగా ఉండే ఇబ్బందులను సైతం ఇది తొలగిస్తుంది. ఈ సుగంధ ద్రవ్యాలతో ఇంకా పలు ఇతర ప్రయోజనాలు సైతం ఉన్నాయి