కావసిన పదార్దాలు :
బియ్యం నూక-రెండు కప్పులునీళ్లు-నాలుగు కప్పులు
పచ్చి శెనగ పప్పు-పావుకప్పు(5-10 నిమిషాలు నీటిలో నానబెట్టి వడగట్టినవి)
జీలకర్ర-అర టీస్పూన్
నెయ్యి-ఒక టీస్పూన్
ఉప్పు-తగినంత.
తయారి విధానం :
స్టవ్పై బాణలి ఉంచి అందులో నెయ్యి వేసి అది వేడెక్కాక నానబెట్టిన పచ్చి శెనగ పప్పును వేసి అర నిమిషం పాటు వేగించాలి. దానిలో నీళ్లు పోసి, ఉప్పు వేసి కొంచెం సేపు ఉడికించాలి. కొద్దిసేపయ్యాక బియ్యం నూక వేసి ముద్ద కట్టకుండా తిప్పాలి. మూత పెట్టి నాలుగైదు నిమిషాలు ఉడికించాక కిందికి దింపేసి చల్లారనివ్వాలి. తరువాత ఈ మిశ్రమాన్ని అరచేయి సైజులో పెద్ద పెద్ద ఉండలుగా చుట్టాలి.